మణిపూర్‌లో ఇటీవలి జరుగుతున్న అల్లర్లకు లోతైన మూలాలు కలిగి ఉన్నాయి. కానీ హైకోర్టు ఇచ్చిన తీర్పు మాత్రం ప్రస్తుత కారణంగా కనిపిస్తోంది. గిరిజనులు అనుభవిస్తున్న మాదిరిగానే మెయితీలకు కూడా షెడ్యూల్డ్ ‌ట్రైబ్‌ (ఎస్టీ) హోదా కల్పించడాన్ని పరిశీలించాలని తీర్పునిస్తూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే మణిపూర్‌ ‌భౌసర్గిక స్వరూపాన్ని,  ప్రస్తుతం కొనసాగుతున్న కలహాలను అర్థం చేసుకోవడమనేది కీలకమైన అంశమే.

22,327 చదరపు కిలోమీటర్ల భౌగోళిక వైశాల్యం కలిగిన రాష్ట్రం మణిపూర్‌.  90 ‌శాతానికి పైగా కొండలు, మిగిలినవి లోయలు. ఇది మూడు ప్రధాన జాతులకు నిలయం. మెయితీలు, కుకీలు, పంగల్లు (మణిపురి ముస్లింలు), ఇంకా నాగాలు 29 స్థానిక తెగలు ఉన్నాయి. మెయితీలు ప్రధానంగా లోయలో నివసిస్తున్నారు. వీరు మొత్తం జనాభాలో 53శాతం. కుకీ నాగా/జోమి తెగలు (చిన్‌-‌మిజో)తో సహా గిరిజన సమూహాలు దాదాపు 40% కొండలలో నివసిస్తున్నారు. మెయితీలు హిందూమతాన్ని అనుసరిస్తున్నారు. కుకీ, నాగా జనాభాలో 90% పైగా గత కొన్ని దశాబ్దాలుగా క్రైస్తవానికి చెందిన వివిధ వర్గాలకు మారారు. మణిపూర్‌ ‌రాష్ట్రం మయన్మార్‌తో 398 కి.మీ అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది.

మెయితీలకు ఎస్టీ హోదా కల్పిస్తే కొండ ప్రాంతాలలో భూములు కొనుగోలు చేస్తారని భయపడి కుకీల నేతృత్వంలోని గిరిజన సంఘాలు హైకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా తమ నిరసనను వ్యక్తం చేయడంతో వివాదం తలెత్తింది. కొండ ప్రాంతంలోని భూమిని పొందడం, నిరాకరించడం అనే క్లిష్టమైన సమస్య సంఘర్షణకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కుకీ జాతి నేతృత్వంలోని ఆల్‌-‌ట్రైబల్‌ ‌స్టూడెంట్స్ ‌యూనియన్‌  ‌మణిపూర్‌ (ATSUM), మే 4, 2023న ఏడు కొండ జిల్లాల్లో గిరిజన సంఘీభావ యాత్ర నిర్వ హించింది. ఈ ప్రదర్శన ఇంఫాల్‌ ‌లోయకు సరి హద్దుగా ఉన్న చురాచాంద్‌పూర్‌ ‌జిల్లాలో హింసాత్మ కంగా మారింది. కుకీలు, మెయితీలు కలిసి సుమారు 60 వేలమంది పాల్గొన్నారు. ఈ హింస రాష్ట్రంలోని మరో పది జిల్లాలకు వేగంగా వ్యాపించింది.

డ్రగ్స్ అడ్డాగా మణిపూర్‌

ఈ అల్లర్ల నేపథ్యంలో తరచుగా విస్మరించే కీలకమైన అంశం-ఈశాన్య ప్రాంతం, ముఖ్యంగా మణిపూర్‌, ‌గత ఐదు నుండి ఏడు దశాబ్దాలలో రవాణా కేంద్రం నుంచి ఉత్పత్తి కేంద్రంగా మారుతూ మాదకద్రవ్యాల వ్యాపారానికి అడ్డాగా ఎలా మారింది అన్నదే?

ఈ ఈశాన్య ప్రాంతం థాయిలాండ్‌, ‌మయన్మార్‌, ‌చైనా, లావోస్‌లతో అంతర్జాతీయ సరిహద్దులను కలిగి ఉంది. అఫ్ఘానిస్తాన్‌ ‌తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద నల్లమందు ఉత్పత్తి చేసే మయన్మార్‌కు సమీపంలో మణిపూర్‌ ఉం‌డటం మాదకద్రవ్యాల ఉత్పత్తికి, అభివృద్ధికి దోహదపడింది. మాదకద్రవ్యాల ఉత్పత్తితో గోల్డెన్‌ ‌ట్రయాంగిల్‌గా అపఖ్యాతి పాలైన థాయ్‌లాండ్‌, ‌మయన్మార్‌, ‌లావోస్‌ ‌సరిహద్దులను మణిపూర్‌ ‌కలిగిఉంది. పెట్రోలియం, ఆయుధాల వ్యాపారం తర్వాత ప్రపంచంలో మూడవ అతిపెద్ద వ్యాపారం మత్తుమందులు.

ప్రపంచవ్యాప్తంగా నల్లమందు అక్రమంగా ఉత్పత్తి చేసే పరిమిత దేశాల్లోనే అఫ్ఘానిస్తాన్‌లో ఎక్కువ భాగం కొనసాగుతోంది. 2022లో అఫ్ఘానిస్తాన్‌ 6,200 ‌టన్నులు ఉత్పత్తి చేసింది. ఇది అంచనా వేసిన ప్రపంచ ఉత్పత్తిలో (7,800 టన్నులు) 80 శాతానికి సమానం. 2019-20కి సంబంధించి అందుబాటులో ఉన్న తాజా వివరాల ప్రకారం మయన్మార్‌ (795 ‌టన్నులు), మెక్సికో (504 టన్నులు) నల్లమందు ఉత్పత్తి చేశాయి.

మణిపూర్‌లో ఈ డ్రగ్స్ ‌మహమ్మారిని ఎదుర్కోవ డానికి, ముఖ్యమంత్రి బీరెన్‌ ‌సింగ్‌ 2018‌లో ‘నిషా థాడోక్లాసి’, ‘వార్‌ ఆన్‌ ‌డ్రగ్స్’ ‌ప్రచారాలను ప్రారంభిం చారు. నల్లమందు మొక్కలను నిర్మూలించడానికి, నాశనం చేయడానికి ప్రతి జిల్లాలో కనీసం 100 మంది పోలీసులతో కూడిన ప్రత్యేక బృందాన్ని కేటాయించారు.

అందుబాటులో ఉన్న గణాంకాలు ఈశాన్య ప్రాంతంలో మాదకద్రవ్యాల సమస్య తీవ్రతను చెబుతున్నాయి. అక్టోబర్‌ 8, 2022‌న అస్సాంలో జరిగిన ‘డ్రగ్‌ ‌ట్రాఫికింగ్‌ అం‌డ్‌ ‌నేషనల్‌ ‌సెక్యూరిటీ’ సదస్సులో ప్రభుత్వం డ్రగ్స్ ఉత్పత్తి,  వ్యాపారంపై భయంకరమైన గణాంకాలను వెల్లడించింది.

2006-2013 మధ్యకాలంలో 1.52 లక్షల కేజీల మాదకద్రవ్యాలను అధికారులు జప్తు చేశారు. ఇది రెట్టింపై 2014-2022 మధ్యకాలంలో 3.30 లక్షల కిలోగ్రాములకు చేరింది. స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాల విలువ కూడా గణనీయంగా పెరిగింది. 2006-2013లో రూ.768 కోట్ల నుండి 2014-2022 రూ.20 వేల కోట్లకు చేరింది.

2018 నుండి అనేక చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాల తయారీ యూనిట్లను గుర్తించడం, నిర్వీర్యం చేయడంతో పాటు, మాదకద్రవ్యాల స్వాధీనం గణనీయంగా పెరిగింది. డ్రగ్స్‌పై యుద్ధంలో భాగంగా దాదాపు 3,716 ఎకరాల్లో అక్రమ గసగసాల (నల్లమందుకు ముడిసరుకు) తోటలు, 5.51 ఎకరాల్లో గంజాయిని అధికారులు ధ్వంసం చేశారు. 2019లో నార్కోటిక్స్ అం‌డ్‌ అఫైర్స్ ఆఫ్‌ ‌బోర్డర్‌ (‌NAB) పోలీసు బృందంతో కలిసి తౌబల్‌ ‌జిల్లాలోని లిలాంగ్‌ ‌వద్ద అంతర్జాతీయ మార్కెట్‌లో రూ. 100 కోట్లు విలువ చేసే బ్రౌన్‌ ‌షుగర్‌ ‌ఫ్యాక్టరీని ధ్వంసం చేశారు. జూన్‌ 2019 ‌నుంచి అక్టోబర్‌ 2020 ‌వరకు ఎనిమిది బ్రౌన్‌ ‌షుగర్‌ ‌ల్యాబ్‌లను మణిపూర్‌ ‌పోలీసులు ధ్వంసం చేశారు. ఈ ఎనిమిది ల్యాబ్‌లతో, ఆరు ల్యాబ్‌లు తౌబాల్‌ ‌జిల్లాలో ఉన్నాయి.

మణిపూర్‌లోని మారుమూల కొండ ప్రాంతాలలో ముఖ్యంగా ఉఖ్రుల్‌, ‌సేనాపతి, కాంగ్‌పోక్పి, కమ్‌జోంగ్‌, ‌చురచన్‌పూర్‌, ‌తెంగ్నౌపాల్‌ ‌వంటి జిల్లాల్లో గసగసాల సాగు అధికం కావడం వల్ల డ్రగ్‌ ‌మాఫియా విచ్చలవిడిగా పెరిగిపోయింది. ఈ ప్రాంతాలు కూడా కుకి గిరిజన ఆధిపత్య ప్రాంతాలు. మాదకద్రవ్యాల నిర్వహణ, వాణిజ్యాన్ని నియంత్రిం చడంలో నిధులు సమకూర్చడంలో కొన్ని రహాస్య సాయుధ బలగాలు (armed underground groups) పాల్గొంటున్నాయని తెలుస్తోంది.

అలాగే మణిపూర్‌లో గసగసాల సాగుదారులను ప్రేరేపిస్తున్నారని కుకీ నేషనల్‌ ఆర్మీ (KNA), జోమీ రివల్యూషనరీ ఆర్మీ(ZRA) తిరుగుబాటుదారులను నిషేధించినట్టుగా నివేదికలు చెబుతున్నాయి.

ఈ ప్రాంతాల్లో డ్రగ్స్ ‌మాఫియా భారీగా పెట్టుబడులు పెట్టింది. 2020-2021 మధ్య 1,420 ఎకరాల గసగసాల తోటలను నాశనం చేయగలిగాయి. అదే సంవత్సరంలో ఉఖ్రుల్‌ ‌జిల్లాలోని ఒక గ్రామంలో పెరిగిన గసగసాల మొక్కలను స్వచ్ఛందంగా నాశనం చేసినందుకు గాను ముఖ్యమంత్రి బీరెన్‌ ‌సింగ్‌  ఆ ‌గ్రామానికి రూ.10 లక్షలు అందజేశారు.

పొగాకు ఉత్పత్తులు, గంజాయి (గంజాయి), ఆల్కహాల్‌, ‌నల్లమందు, స్పాస్మో ప్రాక్సివోన్‌ (SP), ‌మెథాంఫేటమిన్‌ (WY), ‌కోడైన్‌ ‌దగ్గు సిరప్‌, ‌సూడోపెడ్రిన్‌తో సహా సులభంగా అందుబాటులో ఉండే మాదకద్రవ్యాల ముప్పును మణిపూర్‌ ఎదుర్కొంటోంది.

చర్చి ఘటనలో కూడా తప్పుదారి పట్టించే కథనాన్ని ప్రచారం చేస్తున్నారు. కొన్ని క్రైస్తవ వార్తా సంస్థలు, చర్చి వివాదంలో తమను తాము బాధితులుగా చిత్రీకరించుకుంటున్నాయి. దాదాపు 500 చర్చిలను అల్లరిమూకలు ధ్వంసం చేశాయని బీబీసీ పేర్కొంది. ఆంధప్రదేశ్‌లో సువార్తికులు విరాళాలు సేకరిస్తున్నారు. స్థానిక చర్చిలలో సంఘీభావ ప్రార్థనలలో పాల్గొనమని వారి అనుచరు లను ప్రోత్సహిస్తున్నారు. వారి పరిసరాల్లో ఊరే గింపులు చేస్తున్నారు. క్రైస్తవులకు సహాయ చర్యల పేరుతో కొంతమంది సువార్తికులు మణిపూర్‌ ‌చేరుకున్నారు.

మణిపూర్‌లో జరుగుతున్న హింసాత్మక ఘటనలు ఏ వ్యక్తి లేదా రాజకీయ పార్టీకి ముడిపడి లేదు. ఇది కేవలం ఒక సమూహం చేస్తున్న రాద్ధాంతం. అల్లర్లు సృష్టిస్తున్న కుకీ మూకల చేతుల్లో ఆధునిక ఆయుధాలు, యంత్రాలు, చట్టవిరుద్దమైన బంకర్లను ఉండటమే కాకుండా మెయితీలను నాశనం చేస్తామంటూ నినాదాలు చేయడం వంటి ఘటనలు సోషల్‌ ‌మీడియా ద్వారా వెలుగులోకి వస్తున్నాయి. దేశ ప్రజలు దీన్ని గమనిస్తున్నారు. స్థానిక మహిళలు దోషులను రక్షించడంతో పాటు, ఉద్రిక్తతలను నియంత్రించే పనిలో ఉన్న ఆర్మీ బెటాలియన్‌లను అడ్డుకోవడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది.

మణిపూర్‌ అభివృద్ధికి ఎన్డీయే ప్రభుత్వం కృషి

యాక్ట్ ఈస్ట్ ‌విధానం కింద గత ఎనిమిదేళ్లలో 2014 నుండి 2022 వరకు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (DoNER), ఎన్‌ఇసి పథకాల కింద రూ.15,867 కోట్ల విలువైన 1,350 ప్రాజెక్టులను ఎన్డీయే  ప్రభుత్వం మంజూరు చేసింది. ఇటీవల మణిపూర్‌ ‌రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలను కలుపుతూ ప్రపంచంలోనే ఎత్తైన పైర్‌ ‌రైల్వే వంతెనను నిర్మించడం ద్వారా రైల్వేలతో అనుసంధానం జరిగింది. జిరిభామ్‌ ‌నుండి ఇంఫాల్‌ ‌వరకు ప్రతిపాదిత రైలు మార్గం రాష్ట్ర రాజధానికి రైల్వే అనుసంధానాన్ని తీసుకువస్తుంది. రైలు మార్గాన్ని ఇండో-మయన్మార్‌ ‌సరిహద్దులోని మోరే వరకు విస్తరించాలని ప్రతిపాదించారు. ఈ పరిణా మాలతో మణిపూర్‌ ‌త్వరలో మిగతా భారతదేశంతో బలమైన అభివృద్ధిని చవిచూస్తుంది. ఫలితంగా మౌలిక సదుపాయాలు, పర్యాటకం, విద్యకు మరింత ప్రోత్సాహం లభిస్తుంది.

ఈ పరిణామాల మధ్య  మెయితీలకు ఎస్టీ హోదా కల్పించాలన్న హైకోర్టు ఆదేశంతో మణిపూర్‌ అభివృద్ధి, శ్రేయస్సుకు విఘాతం కలిగించే శక్తులు, రాష్ట్రాన్ని శాశ్వతంగా పేదరికంలోకి ఉంచడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. రాష్ట్ర సర్వతోముఖాభి వృద్ధికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అణగ దొక్కడానికి దేశంలోని మిగిలిన విద్రోహశక్తులతో చేరి దేశ ప్రతిష్టను దిగజార్చడానికి కుట్రలు చేస్తున్నారు.

– కె. సురేందర్‌

About Author

By editor

Twitter
YOUTUBE